కరోనా తగ్గేవరకూ సీక్వెల్ సెట్స్ పైకి రాదట..

కరోనా వచ్చి ఎక్కడవారిని అక్కడే చేసిపడేసింది. ముఖ్యంగా చిత్ర సీమను అతలాకుతలం చేస్తుంది. రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఆగిపోవడం , సెట్స్ ఫై ఉన్న షూటింగ్ లు ఆగిపోవడం తో నిర్మాతలు కుంగిపోతున్నారు. తాజాగా ఎఫ్ 3 సీక్వెల్ సైతం ఇప్పట్లో లేదని తేల్చిచెసారు మేకర్స్.

సుప్రీమ్ , పటాస్ , రాజా ది గ్రేట్ చిత్రాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఎఫ్ 2 . వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను నమోదు చేసుకుంది. కామెడీ , మ్యూజిక్ , ఎమోషనల్ ఇలా అన్ని వర్క్ అవుట్ కావడం ముఖ్యంగా వెంకీ తన కామెడీ టైమింగ్ ను మరోసారి చూపించడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనీ అప్పట్లోనే ప్రకటించారు అనిల్. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనిలో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేశ్ చేస్తున్న ‘నారప్ప’ చిత్రం తర్వాత దీనిని సెట్స్ పైకి తీసుకు వెళదామని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడీ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. సినిమా నిర్మాణాలన్ని నిలిచిపోవడంతో అనేక మంది ఉపాధి కొల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తి చేసిన అనిల్..ప్రస్తుతం కరోనా పరిస్థితి ఎక్కువగా ఉండడం తో ఇది పూర్తిగా కంట్రోల్ కు వచ్చాక ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట.