‘ గీత గోవిందం ‘ టాక్ వచ్చేసింది..

విజయ్ దేవరకొండ రష్మిక జంటగా అల్లు అరవింద్ సమర్పణ లో పరశురాం తెరకెక్కించిన చిత్రం `గీత గోవిందం`. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన చిత్ర టీజర్స్ ముఖ్యంగా `ఇంకేం ఇంకేం కావాలే` `వాట్ ద లైఫ్`….పాటలు చిత్రంపై విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రా ఫుటేజ్ లీకవడంతో ఇంకాస్త ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్ అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు. మరి వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ఉందా..? అర్జున్ రెడ్డి తో అదరగొట్టిన విజయ్ గోవిందం గా ఎలా ఆకట్టుకున్నాడు..? అసలు గీత – గోవిందం మధ్య ఏం నడించింది..? ఈ చిత్రం ఫై పబ్లిక్ ఏమంటున్నారు..అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రీమియర్ షో టాక్ చూస్తే..ఈ చిత్రం యూత్ ఫిలిం గా చెపుతున్నారు. విజయ్ – రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని , వారి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

అలాగే మ్యూజిక్ , నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా చెపుతున్నారు. `ఇంకేం ఇంకేం కావాలే` `వాట్ ద లైఫ్`అనే సాంగ్స్ కు థియేటర్స్ మారుమోగిపోతున్నాయి..అలాగే మిగతా సాంగ్స్ కూడా థియేటర్స్ లలో మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఈ సినిమా కథ మాత్రం నామమాత్రంగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునేలా డైరెక్టర్ చేసాడని అంటున్నారు. తన మేకింగ్ స్టైల్ తో ఫస్ట్ హాఫ్ ను మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగించిన, సెకండ్ హాఫ్ హాఫ్ కాస్త స్లో గా తెరకెక్కించాడని అంటున్నారు.

విజయ్ కాలేజ్ లెక్చరర్ గా అదరగొట్టాడని , రష్మిక -విజయ్ పాత్రలకు తప్ప మరొక క్యారెక్టర్ కు అంతగా ప్రాధాన్యత లేదని చెపుతున్నారు. ఎవరు ఊహించని విధంగా నిత్యా మీనన్ – అను ఇమ్మాన్యుయేల్ గెస్ట్ రోల్స్ ఆడియెన్స్ ని షాక్ కు గురిచేశాయి. నిర్మాణ విలువలు , సాంకేతిక వర్గ పనితీరు ఇలా అన్ని బాగున్నాయనై అంటున్నారు. మొత్తానికి ఈ గీత గోవిందం ప్రేక్షకులను సరికొత్త ఫీల్ కు తీసుకరావడం ఖాయం అంటున్నారు.