గొల్లపూడి మరణాన్ని సోషల్ మీడియాతోనే చేతులు దులుపుకున్నారు..

ప్రముఖ నటుడు గొల్ల‌పూడి మారుతీరావు రెండు రోజుల క్రితం అనారోగ్యం తో చెన్నై లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గొల్ల‌పూడి మరణ వార్త విని అంత షాక్ అవుతూ తమ దిగ్భ్రాంతిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసారు.

త‌మిళ‌నాట స్థిర నివాసాన్ని ఏర్ప‌రుచుకున్న గొల్లపూడి.. చివరి వరకు అక్కడే గడిపారు. ఔట్ డోర్ షూటింగుల‌కు చెన్నై నుంచి ప్రయాణం చేసేవారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌తో గొల్ల‌పూడి చివ‌రిదాకా బంధాన్ని కొన‌సాగించారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన్ను కడసారి చూసేందుకు మాత్రం ఎవ్వరు వెళ్ళకపోవడం చాల దారుణమని అంత మాట్లాడుకుంటున్నారు.

గొల్ల‌పూడి మ‌ర‌ణం నుంచి అంత్య‌క్రియ‌ల‌కు మ‌ధ్య స‌మయం ఉన్నా… టాలీవుడ్ జ‌నాలు ఎవ‌రూ చెన్నై వ‌ర‌కూ వెళ్ల‌క‌పోవ‌డం ఫై విమర్శిస్తున్నారు.కేవలం చిరంజీవి మాత్రం గొల్ల‌పూడి పార్థివ దేహానికి నివాళి ఘ‌టించారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తే సరిపోతుందా..కడసారి చూడాల్సిన అవసరం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.