సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పబోతున్న అల్లు అరవింద్..?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్..టాలీవుడ్ ఇండీస్ట్రీ కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడట..ఈ విషయం మీము చెప్పడం లేదు. స్వయం గా అరవింద్ , దిల్ రాజు తో చెప్పాడట. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా ఎన్నో సక్సెస్ లు చవిచూసిన అరవింద్ , తాజాగా గీత గోవిందం చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందనగా సినిమా లీక్ కావడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. ఈ షాక్ తో ఇక సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి పోవాలని ఉందని అరవింద్ అన్నట్లు దిల్ రాజు తెలిపాడు.

రెండు రోజుల కిందట తనకు అల్లు అరవింద్ ఫోన్ చేసి ఇండస్ట్రీని వదిలిపోవాలన్నంత బాధ కలుగుతోందని అన్నట్లు రాజు చెప్పాడు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన అలాంటి మాట అనడం తనకెంతో ఆవేదన కలిగించిందని రాజు చెప్పాడు. ఐతే తామంతా మీ వెనుక ఉన్నామని చెప్పి అరవింద్ కు ధైర్యం చెప్పానన్నాడు. తామందరికీ సినిమా అంటే ప్రాణం అని.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమాలు తీసే నిర్మాతలకు అన్యాయం చేయొద్దని రాజు కోరాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని.. ఆ తప్పు చేసిన వాళ్లే పైరసీని ఆపాలని.. ఇది విజ్నప్తి అనుకున్నా.. హెచ్చరిక అనుకున్నా పర్వాలేదని రాజు చెప్పుకొచ్చాడు.