నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 షో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇప్పటికే ఐదు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరో వారం లో అడుగుపెట్టింది. అయితే గత వారం రోజులు గా ఈ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమారి 21 ఫేమ్ హెబ్బా పటేల్ రాబోతుందనే వార్తలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుండడం తో ఈ వార్తే నిజమే కావొచ్చని అందరు అనుకుంటున్నారు.
ఈ నేపథ్యం లో ఈ వార్త ఫై అసలైన క్లారిటీ ఇచ్చింది హెబ్బా..“నేను ఓన్లీ మా ఇంట్లోనే ఉన్నా.. ఏ ఇంట్లోకి వెళ్లను.. రియాలిటీ షోలు చేయడం లేదు..అంటూ పుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీ తో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. కుమారి 21 ఎఫ్ , ఈడో రకం ఆడో రకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి వరుస హిట్లు అందుకున్న హెబ్బా..ప్రస్తుతం మాత్రం చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా ఉంది. తాజాగా ఈమె నటించిన 24 కిస్సెస్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫై గట్టి ఆశలే పెట్టుకుంది.