ఇద్దరి లోకం ఒకటే అంటున్న రాజ్ తరుణ్..

షార్ట్ ఫిలిమ్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్..ఆ టాలెంట్ తో వెండి తెర అవకాశాలు దక్కించుకున్నాడు.. ఉయ్యాలా జంపాల , కుమారి 21 ఎఫ్ , సినిమా చూపిస్తా మావ వంటి వరుస హిట్స్ తో అతి తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. రెమ్యూనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సినిమాలన్నీ వరుస డిజాస్టర్లు కావడం తో ఇప్పుడు కెరియరే అయోమయంలో పడింది.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబందించిన పూజా కార్య క్రమాలు ఈరోజు పూర్తి అయ్యాయి. కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజ్ తరుణ్ కు జోడిగా మేఘా ఆకాష్ నటించే అవకాశం వుంది. ఆ మేరకు డిస్కషన్లు సాగుతున్నాయి.

కృష్ణారెడ్డి ..గతంలో సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ అనే మాస్ సినిమా చేసాడు. ఈసారి మాత్రం మాంచి లవ్ స్టోరీతో రాజ్ తరుణ్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు ఇద్దరి లోకం ఒకటే అని టైటిల్ ఫిక్స్ చేసారు. హైదరాబాద్ లో ఓ వన్ వీక్ షెడ్యూలు చేసి, తరువాత, ఊటీకి షిప్ట్ అవుతారు. అక్కడ ఓ లెంగ్తీ షెడ్యూలు చేసుకుని వచ్చి, ఆపైన మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతారట. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.