ఇళయరాజా వంశీ మళ్ళీ మరోసారి


కృష్ణ వంశీ మ‌రో కొత్త సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మ‌రాఠీ చిత్రం `న‌ట‌సామ్రాట్‌` ను తెలుగులో `రంగ మార్తాండ‌`గా రీమేక్ చేస్తున్నారు కృష్ణ వంశీ. ప్రకాష్ రాజ్ హీరో రెడ్ బ‌ల్బ్ మూవీ, హౌస్‌ఫుల్ మూవీస్‌, ఎస్వీఆర్ గ్రూప్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ సినిమాకి స్వర‌జ్ఞాని ఇళ‌య‌రాజా పని చేయనున్నారు. వీరి కలయికలో ‘అంతఃపురం’ సినిమా వచ్చింది ఆ సినిమా వ‌చ్చి చాలా కాలం అయ్యింది. ఆ త‌ర‌వాత ఇళ‌య‌రాజా – కృష్ణ‌వంశీ మ‌ళ్లీ ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు. ‘మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లైపోయాయి. ప్ర‌కాష్‌రాజ్ ఇళ‌య‌రాజాకి పెద్ద ఫ్యాన్‌. ప్ర‌కాష్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల‌కు ఇళ‌య‌రాజానే సంగీతం అందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేష‌న్ ఇలా కుదిరింది