ఐటీ అధికారుల ముందుకు రష్మిక…

సినీ నటి రష్మిక ఇంటి ఫై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మరి దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ సమయంలో చెన్నైలో ఒక తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక మొదట ఐటీ దాడులను మామూలుగానే పరిగణించింది.

తన తండ్రికి సంబంధించిన వ్యాపార సంస్థలపై ఐటీ దాడులుగా భావించింది. కాని ఆ సమయంలోనే రష్మిక పేరుపై ఉన్న పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు గుర్తించారట. రష్మిక ఆదాయానికి మించిన ఆస్తులు చాలా ఉన్నాయని ఐటీ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. రష్మిక పేరుపై ఉన్న ప్రతి ఒక్క ఆస్తికి సంబంధించిన లెక్కలను క్లీయర్ గా చూపించాల్సిందిగా ఐటీ అధికారులు నోటీసుల్లో తెలిపారట. ఈరోజు ఆమెను అధికారులు విచారించబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రష్మిక నితిన్ సరసన భీష్మ , అల్లు అర్జున్ సరసన ఓ మూవీ చేయబోతుంది.