జబర్దస్త్ లొల్లి..కారణం ఇదే

ఈటీవీ లో గత కొన్నేళ్లుగా జబర్దస్త్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ మల్లెమాల దీనిని నిర్వహిస్తూ వస్తుంది. భరత్ , నితిన్ లు ఈ షో కు డైరెక్టర్లు..రీసెంట్ గా మల్లెమాల ప్రొడక్షన్స్‌తో విభేదాలు రావడం తో ఆ డైరెక్టర్లు బయటకొచ్చి జీ తెలుగులో జాయిన్ అయ్యారు. జీ తెలుగు లోనే జబర్దస్త్ షో తరహాలో షో మొదలు పెట్టారు. కేవలం ఈ డైరెక్టర్లు మాత్రమే కాదు జబర్దస్త్ టీమ్ మొత్తాన్ని కూడా బయటకు లాగారు. నాగబాబు తో సహా..

ఈ లొల్లి ఫై చమ్మక్ చంద్ర క్లారిటీ ఇచ్చారు..‘జబర్దస్త్ కామెడీ షో నుండి ఎవరు వెళ్లినా షో ఆగదు. జడ్జ్ నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన మాట వాస్తవమే. ఆయనతో పాటు మేం కూడా బయటకు వచ్చేశాం. మళ్లీ వెళ్లొచ్చేమో చెప్పలేం. జబర్దస్త్ అనేది మాకు లైఫ్ ఇచ్చింది. అది ఎవగ్రీన్ దాని నుండి క్విట్ అయ్యే ప్రసక్తే లేదు.. చిన్న బ్రేక్ ఇచ్చాం అంతే. కాని దాన్ని వదలడం బాధగానే ఉంది. జబర్దస్త్‌లో స్కిట్ చేయడం కంటే రాయడం బాగా ప్రెజర్‌గా ఉంది అందుకే బయటకు వచ్చాం అని చెప్పుకొచ్చాడు.