యాత్ర లో జగన్ కనిపించబోతున్నాడు…

వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ మహి తెరకెక్కిస్తున్న చిత్రం యాత్ర. ఫిబ్రవరి 08న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, ఆయన తండ్రి పాత్రలో జగపతిబాబు, ఆయన సోదరుడి పాత్రలో రావు రమేష్ లు నటిస్తుండగా, అసలు జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది అందరికి ఆసక్తిగా మారింది.

ఈ పాత్ర ఫై నిన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈరోజు ఈ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. జగన్ పాత్రలో వైఎస్ జగనే నటిస్తున్నారని సమాచారం. అప్పట్లో జరిగిన సన్నివేశాలను డైరెక్ట్ గా డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్ ఫై చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. ఆ తరువాత ఆయన అభిమానులు పడిన ఇబ్బందుల గురించి, జగన్ ఓదార్పును ఈ సినిమాను చూపించబోతున్నారట. ఇది సినిమా చివర్లో వస్తుందట. మరి ఆ వచ్చే సన్నివేశాల్లో జగన్ ను ప్రేక్షకులు, అభిమానులు చూసుకోవచ్చని చిత్ర యూనిట్ చెపుతున్నారు.