పవన్ కళ్యాణ్ విషయంలో బాధపడుతున్న జీవితా రాజశేఖర్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓడిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు జీవిత, రాజశేఖర్ దంపతులు. భీమవరంలో పవన్ గెలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు . తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని హర్షం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటారని, ఏడాదిలోనే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

వైకాపా గెలుపును పురస్కరించుకొని హైదరాబాద్‌లో తమ ఆనందాన్ని వ్యక్తంచేసిన జీవితా రాజశేఖర్‌ దంపతులు.. దిల్లీలో మోదీని, రాష్ట్రంలో జగన్‌ను గెలిపించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే.