‘శ్రీదేవి బంగ్లా’పై జాన్వీ మౌనం


మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ లీగల్ చిక్కుల్లో పడింది. ఆమె తాజా చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాస్పదమైయింది. దివంగత హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీ కపూర్‌.. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కు నోటీసులు పంపించారు.

తాజాగా విడుదలైన ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్‌, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అన్న సందేహాలు వచ్చాయి. ట్రైలర్‌లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడం, సినిమాలో ప్రియ.. శ్రీదేవిఅనే టాప్‌ హీరోయిన్‌ పాత్రలో నటించడంతో సందేహాలు వచ్చాయి. దింతో బోనీ, ప్రియకు చిత్రబృందానికి నోటీసులు పంపించారు

కాగా, ఈ సినిమాపై చెలరేగుతున్న వివాదంపై శ్రీదేవి కుమార్తె, నటి జాన్వి కపూర్‌ను ఓ కార్యక్రమంలో మీడియా ప్రశ్నించింది. అయితే ఆమె సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ప్రశ్న విని మౌనంగా ఉండిపోయారు. ఇంతలో టీమ్‌ ఆమెను పక్కకు తీసుకెళ్లిపోయారు.