టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది ‘అర్జున్రెడ్డి’. విజయ్ దేవరకొండ నటన.. సందీప్రెడ్డి వంగా దర్శకత్వం ట్రెండ్ సెట్టింగా నిలిచాయి.‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను తమిళంలో, హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే బాలీవుడ్లోనూ ఈ సినిమాని రీమేక్ చేస్తుండడంతో అక్కడ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షాహిద్ కపూర్ని విజయ్ పాత్రకు తీసుకోవడంతో మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రానికి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. తాజాగా కియారా పాత్రకు (ప్రీతి) సంబంధించిన ఫస్ట్లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. దీన్ని కియారా సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. ‘కబీర్ సింగ్’లో ప్రీతి అని ట్వీట్ చేశారు. తెలుగులో షాలినీ పాండేలా అదే వేషధారణలో అమాయకంగా ఆమె కనిపించింది.