దేశాన్ని కంగనా కాపాడాలట..

గత కొన్ని రోజులుగా కంగనా పేరు మీడియా లో వైరల్ గా మారింది. నేపోటిజం ఫై కామెంట్స్ స్టార్ట్ చేసిన కంగనా..ఆ తర్వాత ముంబై ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం రేపింది. ఆ తర్వాత నుండి ఏదో ఒక అంశం ఫై ట్వీట్స్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె తన ట్విట్టర్ ఖాతాలో ” నేను ఓ పోరాట యోధురాలిని. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. దేశ గౌరవం కోసం నా స్వరాన్ని వినిపిస్తాను. ఆత్మగౌరవంతో ఓ జాతీయ వాదిగా జీవిస్తాను. విలువల విషయంలో రాజీపడను.. జైహింద్` అంటూ ట్వీట్ చేసింది. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కాస్త వ్యగంగా రిప్లయ్ ఇచ్చాడు.

కంగన.. మీరు ఓ మణికర్ణిక. మీరు ఓ నలుగురిని తీసుకెళ్లి మన భూభాగంలోకి దూసుకువస్తున్న చైనాపై యుద్ధం చేసి రండి. మీరు ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరని వాళ్లు గుర్తించేలా చేయండి. మీ ఇంటి నుంచి కేవలం ఒక రోజు ప్రయాణం చేస్తే ఎల్‌ఏసీ వస్తుందని కామెంట్ చేశాడు.

అనురాగ్ కామెంట్‌కు కంగనా ఘాటు రిప్లై ఇచ్చింది. దేశ సరిహద్దుల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు ఒలింపిక్స్‌కు వెళ్లండి. దేశం స్వర్ణ పతకాలు కోరుకుంటోంది. ఇదేం బీ-గ్రేడ్ సినిమా కాదు.. ఆర్టిస్టులు ఏమైనా చేసెయ్యగలగడానికి. మీరు ఇంత తెలివి తక్కువ మనిషిగా ఎలా అయ్యారు. మనిద్దరం స్నేహితులుగా ఉన్నప్పుడు మీరు తెలివిగానే ప్రవర్తించేవారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.