భారతదేశ వ్యోమగామి.. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ సైంటిస్ట్ రాకేశ్ శర్మ జీవితకథ ఆధారంగా బాలీవుడ్ లో `సెల్యూట్` పేరుతో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూక్ నటిస్తుండగా , దాదాపు 500కోట్ల బడ్జెట్తో ఈ మూవీ నిర్మిచబడుతుంది. మొన్నటి వరకు ఈ భారీ బడ్జెట్ మూవీ లో ఎవరు హీరోయిన్ గా నటిస్తారనే ఆసక్తి అందర్నీ నెలకొని ఉండేది. తాజాగా ఆసక్తి తెరపడింది. ఈ మూవీ లో కరీనా కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
వాస్తవానికి ఈ సినిమాలో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్ హీరోగా నటించాల్సింది. కానీ అతడు `మహాభారతం 3డి` సిరీస్ని సొంత బ్యానర్లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నందున ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ క్రమంలోనే షారూక్ని ఫైనల్ చేసి సెట్స్ పైకి సిద్ధం అవుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. మహేష్ మాథాయ్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా- సిద్ధార్థ్ రాయ్ కపూర్- రోనీ స్క్రూవాలా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.