ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ సెన్సార్ టాక్..

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్ లోని మొదటి పార్ట్ కథానాయకుడు జనవరి 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా ఈరోజు ఈ చిత్ర సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు సింగిల్ కట్ కూడ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసారు.

సెన్సార్ సర్టిఫికెట్ తో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు నిన్ననే జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో బయోపిక్ కాబట్టి ఈ సినిమాలో ఉన్న పాత్రలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికి బ్రతికి ఉంటె.. వారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలని చెప్పడంతో సెన్సార్ అధికారులు చెప్పడం తో అవి ఈరోజు తీసుకరావడం తో ఈరోజు సెన్సార్ పూర్తి చేసారు.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు డైరెక్టర్ క్రిష్ , బాలకృష్ణ లకు అబినందనలు తెలిపారు. ఓ మరపురాని చిత్రం గా ఇది నిలిచిపోతుందని , మరోసారి అన్నగారిని తెరపై చూసినట్లు ఉందని వారంతా కితాబు ఇచ్చారు. ఇక బయోపిక్ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.