ఘోరం..కథానాయకుడు ను లేపేస్తున్నారు…

భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం’ఎన్టీఆర్ కథానాయకుడు’. బాలకృష్ణ-విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆటతోనే మిశ్రమ టాక్ వచ్చింది. సినిమాలో బాలకృష్ణ గెటప్స్ తప్ప సినిమాలో కథ లేదని, నిడివి కూడా చాల ఎక్కువగా ఉందని టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల ఫై తీవ్రంగా పడింది.

మొదటి రోజు కేవలం రూ.8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు పెరగడం, కానీ రావడం కానీ కష్టమని తేలింది. అది కాక రెండో రోజు చాల థియేటర్స్ జనాలు లేక వెలవెలబోయాయి. దీంతో థియేటర్స్ యాజమాన్యం కథానాయకుడును లేపేసి వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలను వేసేందుకు సిద్ధమైయ్యారు.

ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ చిత్రానికి హిట్ టాక్ వినపడుతుంది..బి,సి సెంటర్లలో కుమ్మేయడం ఖాయమంటున్నారు. దీంతో చాల థియేటర్స్ ఈ సినిమా వైపు చూస్తున్నారు. ఓవరాల్ గా ఎన్నో అంచనాలు పెట్టుకున్న కథానాయకుడు నిరాశ పరిచింది. మరి రెండో పార్ట్ మహానాయకుడు ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.