చిరు చిత్రానికి గాను కీర్తి గట్టిగానే తీసుకుంటుందట..

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వేదాళం మూవీ తో పాటు లూసిఫర్ చిత్ర రీమేక్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో హీరో చెల్లెలి క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేశారనే వార్తలు నిన్నటి వరకు వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు సాయి పల్లవి ని కాకుండా కీర్తి సురేష్ ను ఎంపిక చేసారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు కీర్తి భారీ రెమ్యునరేషన్ అందుకోబోతోందట. హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న కీర్తి సోదరి పాత్రను అంగీకరించడం విశేషమనే చెప్పాలి. కథలో కీలకమైన పాత్ర కావడంతో కీర్తికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట.