ఖైదీ సెన్సార్ పూర్తి..

గత కొంతకాలంగా తమిళ్ హీరో కార్తీ నటించిన ఏ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. వరుస పెట్టి ప్లాప్స్ అవుతుండడం తో కార్తీ మార్కెట్ గా బాగా పడిపోయింది. కార్తీ సినిమా అంటే కొనేందుకు కూడా బయ్యర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. రెండు గంటల ఇరవై నిముషాల నిడివి తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.