కియారా చేతిలో భారీ చిత్రం..

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అగ్ర హీరోల ఛాన్సులు దక్కించుకుంటుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న కియారా తన తదుపరి చిత్రం గురించి చిన్న క్లూవ్ ఇచ్చి చర్చగా మారింది. “నా కొత్త సినిమా డీటెయిల్స్ త్వరలోనే చెబుతాను. ఓ పెద్ద హీరోతో సినిమా ఉంది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంతా ఓకే అయిన తర్వాత నేనే ప్రకటిస్తాను. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం వినయ విధేయ రామ సినిమాపైనే ఉంది.” అంటూ చెప్పుకొచ్చింది.

ఈమె మాటలు బట్టి చూస్తే అది త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న సినిమానే కావొచ్చు అనే అనుమానాలు అందర్నీ కలుగుతున్నాయి. మూడు రోజుల క్రితం త్రివిక్రమ్ కియారా తో సంప్రదింపులు జరిపారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈమె సైతం పెద్ద హీరో అని చెప్పే సరికి ఆ సినిమానే అని అంత ఫిక్స్ అవుతున్నారు.