తన సినిమాలతో ప్రజల్లో చైతన్యం నింపే డైరెక్టర్ కొరటాల శివ..నిజ జీవితంలో కూడా గొప్ప వ్యక్తి అని నిరూపించుకున్నాడు. ఇటీవల శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలలో తిత్లీ తుపాను ఎలాంటి బీభత్సం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. తుపాను ధాటికి అతలాకుతలమైన సిక్కోలు వాసులకి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు.
ఇక ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎప్పుడు ముందుండే సినీ పరిశ్రమ, తిత్లీ తోఫాన్ బాధితుల కోసం కూడా నడుం బిగించారు. ఎన్టీఆర్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, నిఖిల్, కార్తికేయ , బాలకృష్ణ తదితరులు తమకు తోచిన సాయాన్ని అందజేయగా , తాజాగా డైరెక్టర్ కొరటాల శివ సైతం సీఎం సహాయనిధికి రూ. 3 లక్షలు విరాళం అందజేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తుపాను వలన నిరాశ్రయులయిన వారు త్వరగా కోలుకొని వారి జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని తాను కోరుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా కొరటాల స్పష్టం చేశారు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడు.
Praying for the people of cyclone hit Srikakulam to gain strength and rebuild their lives #TitliCyclone pic.twitter.com/zq8uihYonQ
— koratala siva (@sivakoratala) 20 October 2018