క్రిష్ డైరెక్షన్లో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 25వ చిత్రం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ మూవీ తర్వాత మహేష్, రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం 2020వ సంవత్సరంలో పూర్తవుతుంది. దీని తరువాత మహేష్ బాబు గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నాడు. ఇది మహేష్ కు 27వ సినిమా అవుతుంది. మొదట ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగను అనుకున్నారు. కానీ సందీప్ కు పెద్ద హీరోను డైరెక్ట్ చేసే అనుభవం లేని కారణంగా ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడిని తీసుకోవాలని అనుకున్నాడట అల్లు అరవింద్.

అందుకోసం క్రిష్ ను ఎంపిక చేసినట్టుగా ఫిల్మ్ నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో క్రిష్ మహేష్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నించాడు. శివం అనే పేరుతో ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకున్నాడు..కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం క్రిష్ తో సినిమా చేయించాలని అరవింద్ భావిస్తున్నాడట. మరి క్రిష్ డైరెక్షన్లో చేసేందుకు మహేష్ ఒప్పుకుంటాడో లేదో..