‘ప‌ల్లెటూరి పిల్ల‌’ తో వస్తున్న క్రిష్..

ఓ పక్క వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోపక్క టెలివిజన్ రంగం లో కూడా తనదయిన ముద్ర వేసుకుంటున్నాడు డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో మణికర్ణిక సినిమా చేసాడు. త్వరలో ఇది విడుదల కాబోతుంది. అలాగే స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా యన్ టి ఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని , రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. ఇదిలా ఉండగానే తాజాగా ‘ప‌ల్లెటూరి పిల్ల‌’ పేరిట ఓ టీవీ తెరకెక్కిస్తున్నాడు.

క్రిష్ అందించిన ఈ సీరియ‌ల్ కథ సినిమా నేప‌థ్యంలో సాగుతుందట. ఓ పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి హీరోయిన్ గా ఎలా ఎదిగింది అనే పాయింట్ తో ఈ సీరియల్ సాగుతుందట. గతంలో క్రిష్ నిర్మించిన ‘స్వాతి చినుకులు’ సీరియల్ మంచి విజయం సాధించింది. అలాగే ఈ ‘పల్లెటూరి పిల్ల’ సీరియల్ కూడా విజయం సాధిస్తుందని సీరియల్ బృందం బలంగా నమ్ముతుంది.