వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మిస్ ఎన్టీఆర్ ’ చిత్రం తో మల్లి లక్ష్మి పార్వతి పేరు మీడియా లో జోరుగా ప్రచారం అవుతుంది. మొన్నటి వరకు ఆమెను పెద్దగా పట్టించుకోని మీడియా..ఇప్పుడు ఆమెతో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు పోటీ పడుతుంది. ఆమె కూడా అన్ని మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ ఎన్టీఆర్ తాలూకా విషయాలను తెలియజేస్తుంది.
రీసెంట్ గా విడుదలైన లక్ష్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసి వర్మ కరెక్ట్ గా చూపించాడని , ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగిందో అదే చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుందని తెలిపింది. అలాగే జూ. ఎన్టీఆర్ ఫై సంచలన వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ‘రామారావు గారితో వివాహం అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ని నేనే మా ఇంటికి పిలిపించా. ఎంతైనా అతను కూడా మన మనవడే కదా పిలిపించి వాళ్ల తాతగారు నేను జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురం కలిసి ఫొటో దిగాం. మధ్యలో జూ. ఎన్టీఆర్ ఉండి మా భుజాలపై చేతులు వేసి మరీ ఫొటో దిగాడు. మా గవర్నమెంట్ పడిపోయాక నా ఫొటో చింపి అవతల పడేశాడు. వాడు ఎప్పుడూ తాత గారితో ఉన్న ఫొటోనే చూపిస్తాడు.
ఎంతైనా వాడూ ఏమీ తక్కువ కాదు కదా.. ఎవరికీ మినహాయింపు కాదు. ఆ రోజుల్లో జూ. ఎన్టీఆర్ని చాలా బాగా చూశాను. మంచి లిఫ్ట్ ఇచ్చాను. ఆయన్ని త్యాగరాజ గాన సభలో అరంగేట్రం చేయించాను. గడిచిపోయిన గతం కదా.. అందుకే జూ. ఎన్టీఆర్ అవన్నీ మరచిపోయారు అని లక్ష్మి పార్వతి తెలిపింది.