వైరల్ గా మారిన కొత్త పెళ్లికొడుకు ‘కష్టాలు’

సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య ప్రపంచంలో ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది..అది ఏ విషయమైనా సరే దానిని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త పెళ్లికొడుకు పర్సనల్ కష్టాలను సైతం సోషల్ మీడియా లో పెట్టి హల్చల్ చేసారు.

వివరాల్లోకి వెళ్తే..

మారుతీ అనే వ్యక్తి కర్ణాటకలోని బేగూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రీసెంట్ గా ఆయనకు వెళ్ళింది. అయితే భార్యతో గడపటానికి తీరిక దొరకడం లేదని సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘నాకు ఇటీవల పెళ్లైంది. కొన్ని ప్రత్యేక పూజలు చేయించాలి. ఊరిలో కొన్ని పనులున్నాయి. కొత్తగా పెళ్లికావడంతో ఆగలేకపోతున్నాను. మూడ్‌లో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకుని 10 రోజులు సెలవు మంజూరు చేయాలని’ కోరుతూ ఇన్‌స్పెక్టర్‌కు లెటర్ రాశాడు. ఆ లెటర్ ఎలా బయటకొచ్చిందో గాని ఇప్పుడు సోషల్ మీడియా లో ఆ లెటర్ వైరల్ గా మారింది. ఈ లెటర్ చూసిన వారంతా త్వరగా ఆయనకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.