వివాదం లో కైరా అద్వానీ స్వయంతృప్తి

భరత్ అనే నేను చిత్రం తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని , తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ప్రస్తుతం కైరా బోయపాటి డైరెక్షన్లో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’లో హాట్ హాట్ గా నటించినట్లు తెలుస్తుంది.

ఈ మూవీ లో కైరా స్వయం తృప్తి కోసం ఆమె వైబ్రేటర్ వాడే మహిళగా కనిపించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త.. అత్తింటి వాళ్లకు దొరికిపోతుంది. ఈ సీన్ మీదే ‘లస్ట్ స్టోరీస్’ ట్రైలర్ కట్ చేశారు. వైబ్రేటర్ పని చేసే క్రమంలో ఆమె ఇచ్చిన హావభావాలు యూత్ కు పిచ్చికెక్కించేస్తున్నాయి. అంతే విధంగా ఈ సన్నివేశం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో భక్తి పాటను పెట్టడం వివాదస్పదంగా మారింది.

దీనీపై ప్రముఖ గాయాని లతా మంగేష్కర్‌ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భక్తి నేపథ్యంలో వచ్చే ఆ పాటను అలాంటి సన్నివేశానికి ఎందుకు జోడించారో తమకు అర్థం కావట్లేదని, అలా చేయడం ముమ్మాటికీ లతా దీదీని అగౌరవపరచడమేనని ఆమె బంధువు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వివాదం మూలంగా ఆ సన్నివేశాలను మరింతమంది చూస్తున్నారు.