మహా సముద్రం కథ ఇదేనట

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి…మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ కు సైతం ఎంతో క్రేజీ వచ్చింది. ప్రస్తుతం అజయ్…మహాసముద్రం టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ హీరోలు గా నటిస్తుండగా అతిథిరావు హైద‌రి, అనుఇమ్మానియేల్ హీరోయిన్స్ . ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైంది.

ఈ సినిమా ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య జరిగే కథ అట. శర్వానంద్ – సిద్ధార్ద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయట. ఇక శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడట. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం.