మహర్షి ‘న్యూ ఇయర్ ‘ గిఫ్ట్ అదిరిపోయింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ కు కొన్ని గంటల ముందే అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తున్న తన 25వ చిత్రం మహర్షికి సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో పెరిగిన గెడ్డంతో కాలర్ ఎగరేస్తూ ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వాస్తు కనిపించిన మహేష్ .. సెకండ్ లుక్‌లో బ్లాక్ షూట్, కూలింగ్ గ్లాస్‌తో ప్రొఫెషనల్ బిజినెస్‌మేన్‌లా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక మహేష్ వెనుకనే రక్షకులు గొడుగు పట్టుకుని ఉండటం చాలా స్టైలిష్‌గా ఉంది.

ఈ లుక్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా చిత్రం నుండి ఎలాంటి పిక్స్ బయటకు రాకపోయేసరికి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడు మహేష్ లుక్ వచ్చేసరికి వారంతా పండగా చేసుకుంటున్నారు. 2019 ఏప్రిల్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.