మహర్షి టీం సైలెంట్..?

మొన్నటి దాకా మహర్షి చిత్ర నిర్మాతలు నానా హడావిడి చేసి సడెన్ గా సైలెంట్ అయ్యేసరికి అభిమానులు షాక్ లో పడ్డారు. అదేంటి మొన్నటి వరకు ఎపిక్ బ్లాక్ బస్టర్ ..అన్ని కోట్లు చేసింది..ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చాల గొప్పలు చెప్పిన మహర్షి టీం ఇప్పుడు నిశ్శబ్దం అయ్యిందేంటి..మహేష్ లేకపోయేసరికి సైలెంట్ అయ్యిందా..లేక మహేష్ ఉంటేనే ప్రమోషన్ బాగుంటుందని అనుకుంటున్నారా అని అంత మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం కలెక్షన్లు చూస్తే నైజాం లో తప్ప మిగతా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా ఉందని అంటున్నారు. ఓవర్సీస్ తో పాటు సీడెడ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో నష్టాలు ఖాయమని తేల్చేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ 95 కోట్లు షేర్ రూపంలో వచ్చిందా లేదా అనే స్పష్టత చిత్ర యూనిట్ ఇవ్వడం లేదు. మరి మహేష్ వచ్చాక ఆ క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహర్షి చిత్రం తెరకెక్కగా అల్లరి నరేష్ , పూజా హగ్దే లు కీలక పత్రాలు పోషించారు. దిల్ రాజు , అశ్వినీదత్ , పివిపి లు నిర్మించారు.