ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేయబోతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు..ప్రస్తుతం వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమా చేయబోతున్నాడు.

ఖలేజా’ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి జత కడుతున్నట్టు ఖరారైంది. ఈ మేరకు త్రివిక్రమ్‌కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు, ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అయితే, ఈ రెండు సినిమాల షూటింగ్‌లు వచ్చే ఏడాది ప్రారంభంకానున్నట్టు సమాచారం.