సరిలేరు నీకెవ్వరూ చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ – అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన సరిలేరు మూవీ సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.మహేష్ బాబు , నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరిరావు ఉన్నారు.
స్వామివారి దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో మహేష్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీ లో సమావేశంలో మహేష్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, ‘సరిలేరు నీకెవ్వరు’ బృందం అనిల్ సుంకర, దిల్ రాజు, విజయశాంతి, అనిల్ రావిపూడి పాల్గొన్నారు.