సక్సెస్ మీట్ లో మహేష్ తన మాటలతో అదరగొట్టాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా వరంగల్ లో సక్సెస్ మీట్ ను శుక్రవారం ఏర్పటు చేసారు. ఈ సక్సెస్ మీట్ లో మహేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడి ఆశ్చర్య పరిచారు.

మొదటిగా ‘రమణా లోడ్ ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మాస్ డైలాగ్‌తో స్పీచ్ మొదలుపెట్టిన మహేష్ ..మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ గురించి..హీరోయిన్ రష్మిక గురించి..‘ఈ సంక్రాంతి నాకు ఎప్పుడూ గుర్తుండి పోద్ది. ఎందుకంటే.. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు నా నుండి ఎలాంటి చిత్రమైతే కోరుకుంటారో ఆ సినిమాను అనీల్ రావిపూడి గారు ఇచ్చారు. నేను ఎప్పుడూ స్టేజ్ మీద సినిమా డైలాగ్ చెప్పను.. కాని ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత కూడా చెప్పకపోతే ఎలా అంటూ అసలైన స్పీచ్ ను స్టార్ట్ చేసాడు. ఆయన ఏం మాట్లాడాడారో మీరే చూడండి.