గల్లా కు మహేష్ విషెష్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ తో పాటు లోక్ సభ లోను ఫ్యాన్ గాలి బాగా వీసింది. 151 అసెంబ్లీ స్థానాలు , 22 లోక్ సభ స్థానాలు గెలిచి వైసీపీ తొడకొట్టింది. ఇక 23 అసెంబ్లీ , 3 లోక్ సభ స్థానాలతో సైకిల్ సరిపెట్టుకుంది. ఇక గుంటూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ అనూహ్యంగా విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

గల్లా విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి రెండుసారి విజయం సాధించిన గల్లా జయదేవ్ కు మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది మరుపురాని విజయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే జగన్ , మోడీ విజయం పట్ల కూడా స్పందించారు.