మరికొద్ది సేపట్లో మజ్ను వచ్చేస్తున్నాడు..

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా వెంకీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మిస్టర్ మజ్ను. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్లోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నడం విశేషం.

అదే ఈవెంట్లో ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను 8:30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అఖిల్, హలో చిత్రాల ప్లాపుల తర్వాత అఖిల్ నుండి వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీ ఎలాగైనా హిట్ సాదిస్తుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. జనవరి 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.