మణిరత్నం క్రేజీ ప్రాజెక్ట్ కు న‌వ‌ర‌స టైటిల్

మ‌ణిర‌త్నం-నెట్‌ఫ్లిక్స్ తో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి న‌వ‌ర‌స అనే టైటిల్ ను ఖ‌రారు చేసారు. ఈ చిత్రాన్నీ 9 మంది ద‌ర్శ‌కులు, 9 క‌థ‌ల‌తో తెర‌కెక్కించ‌డం విశేషం. ఏఆర్ రెహ‌మాన్, గిబ్రాన్ స‌హా 8 మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి కేవీ ఆనంద్‌, గౌత‌మ్ మీన‌న్‌, కార్తీక్ సుబ్బ‌రాజు, బిజోయ్ నంబియార్‌, పొన్ర‌మ్‌, హ‌లిత ష‌మీమ్‌, కార్తీక్ న‌రేన్‌, ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్‌, అర‌వింద్ స్వామి డైరెక్ట‌ర్లుగా ప‌నిచేయ‌నున్నారు. రేవ‌తి, నిత్య‌మీన‌న్‌, ఐశ్వ‌ర్య‌రాజేశ్‌, పూర్ణ‌, రిత్విక‌, పార్వ‌తి, తిరువొతు ఫీమేల్ లీడ్స్ లో న‌టించ‌నుండగా..అర‌వింద్ స్వామి, సూర్య‌, సిద్దార్థ్‌, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌స‌న్న‌, గౌత‌మ్ కార్తీక్ తోపాటు మ‌రికొంత న‌టులు మేల్ లీడ్స్ లో క‌నిపించ‌నున్నారు. మరి ఇంతమంది చేయేసినా ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

MANI RATNAM – NETFLIX COLLABORATE… 9 stories… 9 directors… 1 film… #ManiRatnam along with Jayendra Panchapakesan and #Netflix collaborate for an anthology… Titled #Navarasa… Details in the posters… pic.twitter.com/LgXcRLToZp— taran adarsh (@taran_adarsh) October 28, 2020