మణికర్ణిక ట్రైలర్ టాక్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో భారతదేశ ప్రజలందరికీ బాగా సుపరచితమైన ‘రాణి లక్ష్మీ భాయ్’ యొక్క జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. ఎన్నో ఇబ్బందుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకొని గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందంటే..

‘ఝాన్సీ ప్రాంతంపై బ్రిటిషర్ల కన్నుపడింది. ఒకవేళ ఝాన్సీని కాపాడే అధికారి రాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ మహిళ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి..‘నేను ఇందాక ఓ అమ్మాయిని చూశాను. తన పేరు మణికర్ణిక’ అని చెప్తున్నప్పుడు కంగన పులిని వేటాడుతున్న సన్నివేశం ఆకట్టుకుంటోంది.

కత్తిసాము చేస్తున్న సమయంలో కంగన ముగ్గురు వ్యక్తులపై నుంచి దూకి ఏనుగుపై కూర్చున్న సన్నివేశం హైలైట్‌గా అనిపిస్తుంది. ఝాన్సీ ప్రాంతానికి మహారాణిగా మణికర్ణికను ప్రకటిస్తున్నప్పుడు..‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీని కాపాడతానని మాటిస్తున్నాను’ అని చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మణికర్ణిక తన భర్త, బిడ్డను కోల్పోవడం, ఝాన్సీ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిషర్లను చీల్చిచెండాడం వంటి సన్నివేశాలు సినిమా ఫై ఆసక్తి పెంచాలా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తూనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అవుతుంది.

ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. మ‌ణికర్ణిక చిత్రానికి పోటీగా హృతిక్ సూప‌ర్ 30 కూడా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. రెండు చిత్రాల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌గా, ఏ మూవీ భారీ విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.