మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జార్జియాలో మొదలు పెట్టుకుంది. దాదాపు 40రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 300 గుర్రాలు,150 మంది జూనియర్ ఆర్టిస్ట్స్తో పాటు కొంత మంది సీనియర్ స్టార్స్ జార్జియా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్లిన చిరు..ముందుగా రామ్ చరణ్ మూవీ సెట్ కు వెళ్లారు.
షూటింగ్ సంబందించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి, ఉపాసన, రామ్ చరణ్, సుస్మిత బ్లాక్ డ్రెస్ ధరించి డిన్నర్కి వెళ్లారు. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్లో తెలియజేస్తూ ఫోటో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్లో ఉన్న మెగా ఫ్యామిలీని చూసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కొణెదల ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చిరంజీవి సరసన నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు.
Dinner date with Mamaya…. all dressed in black! #Megastar visits #ramcharan on the sets of #rc12 before heading to Georgia. pic.twitter.com/atpdE9ZRbW
— Upasana Kamineni (@upasanakonidela) September 20, 2018