మెగా ఆఫర్ కొట్టేసిన గుణ..

RX100 తో భారీ విజయం అందుకున్న కార్తికేయ..ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా 90ML చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరి అభిమానులను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో కార్తికేయ కు మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

గుణ369 సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వెళ్లిన అరవింద్, తన బ్యానర్ లో కార్తికేయకు అవకాశం ఇస్తాన్నని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే ఇప్పుడు కార్తికేయ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా అనే టైటిల్ తో కొత్త సినిమా ప్రకటించారు. కౌషిక్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రాబోతోంది. మూవీలో కార్తికేయ పేరు బస్తీ బాలరాజు. ఈ సినిమా కు సంబందించినా మిగత విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అరవింద్ పెద్ద సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న హీరోలతో కొత్త డైరెక్టర్లతో సినిమాలు ప్రకటిస్తున్నాడు.

ఇప్పటికే నిఖిల్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు కార్తికేయ హీరోగా ఇంకో సినిమా. త్వరలోనే రాజ్ తరుణ్ హీరోగా కూడా ఓ సినిమా ప్రకటించబోతోంది.