మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం మిస్ ఇండియా. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, సుమంత్, నదియా మొదలుగు వారు నటిస్తున్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఫోక్ సాంగ్ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ సినిమా విడుదలవుతుంది.