సంక్రాంతి బరిలో మిస్టర్ మజ్ను..

అక్కినేని హీరో అఖిల్ – వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిన్న ( సెప్టెంబర్ 20 న ) అక్కినేని నాగేశ్వర్ రావు జయంతి సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. అఖిల్ ను రొమాంటిక్ గా చూపించడం , టీజర్ సైతం ఆకట్టుకునేలా ఉండడం తో ఈ సినిమా ఫై అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని ముందు నుండి డిసెంబర్ లో విడుదల చేయాలను అనుకున్నప్పటికీ , తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఈచిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని వినికిడి. ఇప్పటికే సంక్రాంతి కి రేసులో ‘ఎన్టీఆర్ బయోపిక్ , ఎఫ్2 , ఆర్ సి 12’ చిత్రాలు ఉండగా ఇప్పుడు వాటి లిస్ట్ లో మిస్టర్ మజ్ను కూడా చేరింది. మరి స్టార్ హీరోలతో అఖిల్ ఎలా పోటీ పడతాడనేది చూడాలి. ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు.