కొత్త సినిమాను ప్రారంభించిన నాగ శౌర్య

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగ షోర్య. ప్రస్తుతం సెట్స్ ఫై రెండు సినిమాలు ఉండగానే..తాజాగా మరో సినిమాను తన సొంత బ్యానర్ లో ప్రారంభించాడు. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించిన నాగశౌర్య.. నాలుగో సినిమాను అధికారికంగా ఈరోజు ప్రారంభించారు.

ముందుగా స్క్రిప్ట్ ను నిర్మాత నాగ‌వంశీ చిత్ర‌యూనిట్ సభ్యుల‌కు అంద‌జేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయ‌గా..కొర‌టాల శివ క్లాప్ కొట్టాడు. డైరెక్ట‌ర్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్‌పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ కానుంది. ప్రస్తుతం సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీతో పాటు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శౌర్య.