మహేష్ , నమ్రత ప్లాన్ అదిరింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సినిమాలే కాక బిజినెస్ రంగంలోను తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలే ఏఎంబీ సినిమాస్ పెడుతూ హైదరాబాద్ లో ఓ భారీ థియేటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంత ఈ మల్టిప్లెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఈ థియేటర్ లో ఏడు స్క్రీన్ లు ఉండగా , అందులో ఆరు స్క్రీన్ లను రెగ్యులర్ గా సినిమాలు ప్రదర్శించగా, ఒక స్క్రీన్ లో మాత్రం ప్రత్యేక షో లు మాత్రమే ప్రదర్శిస్తారని సమాచారం.

ఇక ఈ థియేటర్ కు సంబందించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి నమ్రత శిరోద్కర్ చూసుకుంటుంది. ప్రపంచ లెవల్లో ఈ థియేటర్ గురించి మాట్లాడుకునేలా ఆమె ప్రచారం చేస్తుంది. ఒకప్పుడు చిత్ర ప్రివ్యూ లన్ని ప్రసాద్స్ లేదా ఐమాక్స్ థియేటర్ లలో ప్రదర్శించే వారు..కానీ ఇప్పుడు సినిమావాళ్లందరి ప్రివ్యూలు \ఏఎంబీ మాల్ లోనే పెట్టేస్తున్నారు. మొన్న `అంతరిక్షం 9000కెఎంపిహెచ్` ట్రైలర్ రిలీజ్ చేయగా, తాజాగా భైరవగీత ప్రివ్యూ సహా ఇకపై సినిమాల ప్రివ్యూలన్నీ ఇక్కడే వేస్తున్నారు. మొత్తం మీద మహేష్ , నమ్రత ప్లాన్ అదిరింది.