తిత్లీ తుఫాన్ బాధితులకు నందమూరి హీరోల సాయం..

ఇటీవల తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను తీవ్ర గా నష్టపరిచింది. ఈ తుఫాన్ దెబ్బకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు కుప్పకూలడంతో పలు గ్రామాల్లో చీకటిలోనే మగ్గుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా నేలకొరిగాయి. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే సంపూ రూ. 50 వేలు, విజయ్ దేవరకొండ లు 5లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించగా, తాజాగా అగ్ర హీరో ఎన్టీఆర్ 15లక్షలు అలాగే ఆయన అన్న కళ్యాణ్ రామ్ 5లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం గా అందజేసి వారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇక వీరిలాగే మరికొంతమంది నటులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్ అరవింద సమేత తో భారీ హిట్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మించారు.