‘నన్ను దోచుకుందువటే’ టాక్ …

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఈరోజు (సెప్టెంబర్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోవడం తో ఈ సినిమా టాక్ బయటకొచ్చింది.

సినిమా చూసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ స్పందనను తెలియపరుస్తూ సినిమాకు పాజిటివ్ టాక్ అందిస్తున్నారు. సినిమా చాలా బాగుందని, సుధీర్‌బాబు కెరియర్ లో మరో క్లాసికల్ హిట్ పడిందని , సినిమా మొత్తం చాల కామెడీ గా సాగిపోయిందని, ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా అని ట్వీట్ చేస్తున్నారు. సుధీర్ కు జోడిగా నటించిన నభా నతేష్ సైతం గ్లామర్ పరంగానే కాక తన నటనతో కట్టిపడేసిందని చెపుతున్న్నారు.

ఇక వైవా హర్ష మరోసారి తనదయిన కామెడీ తో థియేటర్స్ లలో నవ్వులు పోయించారని చెపుతున్నారు. నూతన డైరెక్టర్ అయినప్పటికీ సరికొత్త టేకింగ్ తో సినిమాను చాల అందంగా నడిపించి ఆకట్టుకున్నారని చెపుతున్నారు. ఓవరాల్ గా అందరిని దోచుకునే చిత్రమని చెపుతున్నారు.