మళ్లీ నయన పెళ్ళికి బ్రేక్ పడిందట..

గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నటి నయనతార మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే వార్త మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసందే..ఎప్పటికప్పుడు మీడియా కంటపడుతున్న కానీ తమ ప్రేమ విషయాన్నీ మాత్రం చెప్పకుండా దాటవేస్తుంటారు. ఇక వీరి పెళ్లి కోసం అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ సైతం ఆసక్తి గా ఎదురుచూస్తుంది.

కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో మొన్నటివరకు ప్రచారం అయ్యింది. కానీ ఇప్పుడు పెళ్లికి బ్రేక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొన్నటివరకు పెళ్లి సిద్ధమైన ఈ జంట..మళ్లీ ఎందుకు బ్రేక్ ఇచ్చారని సినీ ప్రముఖులు సైతం మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి అనేది వారే తెలపాలి.