సినీ నటి నికిత ఇక లేరు..

బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటి నికిత (30) ఇక లేరు. ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే ఆమెను కటక్‌ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు డాక్టర్స్ తెలిపారు. బుల్లితెర ఫైనే కాకుండా వెండితెరపై కూడా కనిపించి ఆకట్టుకుంది.

ఏసీపీ నికితగా ఆమె పాత్రలో జీవించి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించారు. గూండా, చోరీ చోరీ మొన్నొ చోరీ వంటి ఒడియా చలన చిత్రాల్లో ఆమె నటించింది. గూండా చలన చిత్రం ఆమె చివరి సినిమాగా నిలిచిపోయింది. ఈమె మరణ వార్త తెలుసుకొని అభిమానులు , చిత్ర నటి నటులు శోకసంద్రం లో మునిగిపోయారు.