ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్..టెంపర్ , జనతా గ్యారేజ్ , జై లవకుశ వంటి సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత అనే చిత్రం చేస్తున్న సంగతి తెల్సిందే. దసరా బరిలో ఈ సినిమాను తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రేయిపగలు కష్టపడుతున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడు. ఈ నేపథ్యం లో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్.. తుఫాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అలాగే సీనియర్ హీరో నాగ్ సైతం బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, దర్శకుడు శశాంక్ కైతాన్ తో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించారట. కథ నచ్చడంతో ఎన్టీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నారా లేదంటే.. ఫుల్ రోల్ చేస్తున్నారా..?అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించబోతారట. రణ్ భూమి పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. 2020 దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.