మైత్రికి ‘మత్తు’ ఇచ్చిన ఎన్టీఆర్..

అతి తక్కువ సమయంలోనే అగ్ర బ్యానర్ గా గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన ఈ బ్యానర్..తాజాగా స్మాల్ బడ్జెట్ తో కొత్త నటి నటులతో మత్తు వదలరా అనే సినిమా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్ ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా పరిచయం కాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో న్యూస్ పేపర్స్‌పై నిద్రపోతున్న హీరోను చూపించారు. అతని టీషర్ట్‌పై టెక్నీషియన్స్ పేర్లు రాసి ఉండటం దర్శకుడి లోని కొత్త థాట్ చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ కూడా ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని చెబుతూ.. మత్తు వదలరా చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎన్టీఆర్. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి (చెర్రీ) – సుమలత నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.