ఎన్టీఆర్ కథానాయకుడు లో అదే మిస్ అయ్యిందా..?

యావత్ సినీ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్టీఆర్ కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారం గా రావడం తో ఈ సినిమా కూడా మహానటి చిత్రాన్ని మించేలా ఉంటుందని అంత భావించారు కానీ ఆ రేంజ్ లో ఆకట్టుకోలేదని తెలుస్తుంది.

సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సన్నివేశం..అతికించినట్లు ఉండడం తో ఏదో అతుకుల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ హీరో అవ్వడం ఆ తర్వాత ఒక స్టార్ గా మారడం ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇవన్నీ ఎమోషన్ లాగా కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్. మహానటి సినిమా విషయంలో ఇలా జరగలేదు. సావిత్రి జీవితాన్ని కూడా సినిమా షూటింగ్ లో భాగం చేయడం తో జనాలకు బాగా నచ్చింది. కానీ ఎన్టీఆర్ కథానాయకుడు విషయంలో ఆలా జరగకపోయేసరికి ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మిశ్రమ టాక్ బాగా వినిపిస్తుంది. మరి రేపటి నుండి వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి కథానాయకుడు వాటితో ఎలా పోటీ పడతాడో చూడాలి.