ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్

నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి నేడు. ఈ సందర్బంగా శనివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, సుహాసిని, రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ప్రదక్షణ చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

కాసేపు ఘాట్‌ వద్ద కూర్చొని ఆయన్ను గుర్తుచేసుకున్నారు. వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.